ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) తయారు చేసే కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. లోపాలు కలిగిన వాహనాలను వినియోగదారులకు అందించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ ఆయా కంపెనీలను కేంద్రం నోటీసుల్లో ఆదేశించింది. స్పందనను తెలియజేసేందుకు ఆయా కంపెనీలకు కేంద్రం ఈ నెలాఖరు దాకా గడువు విధించింది. కేంద్రం నుంచి నోటీసులు అందుకున్న కంపెనీల్లో ఎలక్ట్రిక్ (ఓలా ఎలక్ట్రిక్), ఒకినావా, ప్యూర్ ఈవీ తదితర కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు తయారు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల్లో పలు వాహనాలు షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయిన సంగతి తెలిసిందే.