సికింద్రాబాద్ :
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు రెచ్చిపోవడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితి అదుపు తప్పింది.ఇక చేసేది ఏమీ లేక ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరుపుతున్నారు.
ఆందోళనకారులను చెదరగొట్టేందుకు గాల్లో కాల్పులు జరుపుతున్నారు పోలీసులు. ఈ కాల్పుల్లో కొంత మంది ఆందోళన కారులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. అయితే కాసేపటి క్రితమే ఈ ఆందోళనలో పాల్గొన్న ఓ యువకుడు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని ఒకటో నంబర్ ఫ్లాంట్ ఫాం దగ్గర ఓ యువకుడు పోలీసుల కాల్పుల్లో మరణించారని సమాచారం అందుతోంది. ఇక మరికొందరికి గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.